YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఫోన్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడుతుండటం, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ను అధికార పీఠం నుంచి దించేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తోన్న సమయంలో ఆమెకు మోదీ ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోన్లో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకరక్తల దాడి, అరెస్ట్, కారులో ఉండగానే క్రేన్తో లాక్కెళ్లడం లాంటి ఘటనలపై షర్మిలకు మోదీ సానుభూతి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న విషయంపై తాము అండగా నిలుస్తామంటూ షర్మిలకు మోదీ భరోసా కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని షర్మిలకు మోదీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను గట్టిగా ప్రశ్నించాలని సూచించినట్లు టాక్ నడుస్తోంది.
ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా షర్మిలను మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో మోదీతో షర్మిల భేటీ అయ్యే అవకాశముంది. గత కొంతకాలంగా షర్మిల బీజేపీ వదిలిన బాణం అని, ఆమె బీజేపీ మనిషి అంటూ విమర్శలు వస్తున్న క్రమంలో మోదీ ఫోన్ చేయడం, షర్మిలపై జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ నేతలు ఖండించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల గట్టిగా ప్రశ్నిస్తోంది. టీఆర్ఎస్ నేతలు టార్గెట్గా పాదయాత్రలో తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్న షర్మిలకు బీజేపీ కూడా మద్దతు పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్ట్లలో భారీగా అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ డైరెక్టర్, కాగ్కు కూడా ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనతో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.ఈ పరిణామాల క్రమంలో షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ కాల్తో రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ప్రధాని మోదీ ఫోన్ చేయడంపై షర్మిల స్పందించారు. తనకు అండగా నిలిచిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ఒక్కరే కాదని, తనపై జరిగిన దాడి ఘటనపై చాలామంది ఫోన్ చేసి పరామర్శించినట్లు షర్మిల పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి, అరెస్ట్పై సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా షర్మిలను మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో మోదీతో షర్మిల భేటీ అయ్యే అవకాశముంది. గత కొంతకాలంగా షర్మిల బీజేపీ వదిలిన బాణం అని, ఆమె బీజేపీ మనిషి అంటూ విమర్శలు వస్తున్న క్రమంలో మోదీ ఫోన్ చేయడం, షర్మిలపై జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ నేతలు ఖండించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల గట్టిగా ప్రశ్నిస్తోంది. టీఆర్ఎస్ నేతలు టార్గెట్గా పాదయాత్రలో తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్న షర్మిలకు బీజేపీ కూడా మద్దతు పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్ట్లలో భారీగా అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ డైరెక్టర్, కాగ్కు కూడా ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనతో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.ఈ పరిణామాల క్రమంలో షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫోన్ కాల్తో రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ప్రధాని మోదీ ఫోన్ చేయడంపై షర్మిల స్పందించారు. తనకు అండగా నిలిచిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ఒక్కరే కాదని, తనపై జరిగిన దాడి ఘటనపై చాలామంది ఫోన్ చేసి పరామర్శించినట్లు షర్మిల పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి, అరెస్ట్పై సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.