యాప్నగరం

ఆ రెండ్రోజులు హైదరాబాద్‌లోనే మోదీ.. ప్రధాని తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జులై 2న మోదీ హైదరాబాద్‌‌కు వస్తున్నారు. జులై 2, 3 తేదీల్లో మోదీ ఇక్కడే ఉండి.. తిరిగి 4వ తేదీ ఉదయం ఏపీకి బయలుదేరి వెళ్తారు.

Authored byRaj Kumar | Samayam Telugu 26 Jun 2022, 9:35 am
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జులై 2న మోదీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ హైదరాబాద్‌లోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళ్తారు.
Samayam Telugu PM Modi Hyderabad Tour


మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సారథ్యం వహించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆయన ఈ క్రమంలో జులై 1వ తేదీన ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు జేపీ నడ్డాను భారీ ర్యాలీతో స్వాగతించాలని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలతో బీజేపీ మైలేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.