యాప్నగరం

నిమజ్జనంలో అపశ్రుతి.. గణేశ్ విగ్రహాన్ని లారీలోకి ఎక్కిస్తుండగా..

Hyderabad నగరంలో నిర్వహిస్తున్న గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాత బస్తీలో వినాయక విగ్రహాన్ని లారీలోకి ఎక్కిస్తుండగా ఓ కానిస్టేబుల్ క్రేన్ నుంచి కిందపడ్డారు. దీంతో ఆయణ్ని కేర్ ఆసుపత్రికి తరలించారు.

Samayam Telugu 12 Sep 2019, 2:33 pm
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌ పరిధిలో వినాయక నిమజ్జన విధులు నిర్వహిస్తున్న రవీందర్ ఓ పోలీస్ కానిస్టేబుల్ తీ‌వ్రంగా గాయపడ్డాడు. కిషన్‌బాగ్ వద్ద గణేశ్ విగ్రహాన్ని క్రేన్‌తో లారీలోకి ఎక్కించే సమయంలో రవీందర్ అకస్మాత్తుగా క్రేన్‌పై నుంచి కింద పడిపోయారు. ఆయనకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆ కానిస్టేబుల్‌ను వెంటనే నాంపల్లి కేర్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ganesh


Must Read: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపతి.. విశేషాలివే

మరోవైపు జంట నగరాల్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయమే ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటికి క్రితమే ముగిసింది. హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్న గణనాథుణ్ని భారీ క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.

అనంతరం మిగతా విగ్రహాలను ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనోత్సవంలో పాల్గొనడానికి ట్యాంక్ బండ్ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలీసుల పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.