యాప్నగరం

భద్రాచలంలో మందుపాతర్ల కలకలం.. నిర్వీర్యం చేసిన పోలీసులు

మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే పనిలో పడ్డారు. గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టుల కోసం ఖాఖీల తీవ్రంగా జల్లెడ పడుతున్నాయి.

Samayam Telugu 20 Sep 2020, 7:21 am
తెలంగాణ మావోలు కదలికలు మళ్లీ కలకలం రేపుతుున్నాయి. తాజాగా భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు శనివారం గుర్తించి నిర్వీర్యం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలివేరు-తేగడ గ్రామాల నడుమ రహదారి పక్కన మావోయిస్టులు ఏర్పాటు చేసిన మూడు మందుపాతరలను.. రోడ్డు తనిఖీల్లో భాగంగా పోలీసులు గుర్తించారు. ఇది ప్రధాన రహదారి కావడంతో తేగడ క్రాస్‌రోడ్‌, కలివేరు గ్రామాల మధ్య గంటన్నరకుపైగా రాకపోకలను నిలిపివేశారు.
Samayam Telugu మావోల మందుపాతర్ల కలకలం
maoists land mines


అనంతరం పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు పేలుడు పదార్థాలను తొలగించారు. అక్కడ్నుంచి తీసుకెళ్లి సమీప ప్రాంతంలో పేల్చివేశారు. ఘటనా స్థలాన్ని ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరుగనున్న మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More: మాస్కు ధరించలేదని స్వీట్ షాప్ సీజ్.. కలెక్టర్ కఠిన చర్యలు

మరోవైపు కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రాణహిత నది సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఒకరిని మంగిదళానికి చెందిన కోయ వర్గీస్‌ (ఛత్తీస్‌గఢ్)గా గుర్తించారు. మరొకరు మహిళా మావోయిస్టుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.