బక్రీద్ పండుగ రోజు సికింద్రాబాద్లో అపహరణకు గురైన బాలిక ఫాతిమా కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కిడ్నాపర్ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన 20 బృందాలతో నగరాన్ని జల్లెడ పట్టి, చివరకు సీసీ కెమెరాల సాయంతో నిందితుణ్ని గుర్తించారు. కిడ్నాపర్ నుంచి ఫాతిమాను సురక్షితంగా విడిపించారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
గత సోమవారం సాయంత్రం రాజు.. హజీరా అనే దంపతుల కళ్లు గప్పి ఓ దుండగుడు వారి కూతుర్ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బక్రీద్ నాడు రాజు హజీరా తమ ముగ్గురు పిల్లలతో సికింద్రాబాద్ పాట్నీ బస్ స్టేషన్ వద్ద నడుచుకుంటు వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తనను తాను రాజుగా పరిచయం చేసుకొని మాటలు కలిపాడు.
ముగ్గురు పిల్లలను ఎలా మోస్తారు అంటూ ఆ దంపతుల పెద్ద కూతురు ఫాతిమాను దుండగుడు రాజు ఎత్తుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఫాతిమా ఆకలిగా, ఉందనండంతో దంపతులు పాల కోసం ఒక హోటల్ లోపలికి వెళ్లారు. బయటకి వచ్చి చూసే సరికి దుండగుడు రాజు, ఫాతిమాతో సహా మాయమయ్యాడు. తన కూతురు కిడ్నాప్ గురైందంటూ ఫాతిమా తండ్రి రాజు రాంగోపాల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాట్నీ సెంటర్, నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ కిడ్నాపర్ జాడ దొరకలేదు. దీంతో కిడ్నాప్కు గురైన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు బాలికను అపహరించినట్లు గుర్తించారు. 20 బృందాలు ఏర్పాటు చేసి, నగర వ్యాప్తంగా గాలించారు. సీసీటీవీల ఆధారంగా నిందితుడు ఏ ప్రాంతంలో సంచరించాడో గుర్తించారు.
చివరకు కిడ్నాపర్ గోషామహల్లోని కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే కిడ్నాపర్.. సలీమ్ అనే తన స్నేహితుడికి పిల్లలు లేక బాధపడుతున్నాడని, అతని కోసమే కిడ్నాప్ చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు సలీం ఇంటికి చేరుకుని ఫాతిమాను రక్షించారు. కిడ్నాప్ చేసిన రాజుతోపాటు, సలీమ్ను అరెస్టు చేశారు.
గత సోమవారం సాయంత్రం రాజు.. హజీరా అనే దంపతుల కళ్లు గప్పి ఓ దుండగుడు వారి కూతుర్ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బక్రీద్ నాడు రాజు హజీరా తమ ముగ్గురు పిల్లలతో సికింద్రాబాద్ పాట్నీ బస్ స్టేషన్ వద్ద నడుచుకుంటు వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తనను తాను రాజుగా పరిచయం చేసుకొని మాటలు కలిపాడు.
ముగ్గురు పిల్లలను ఎలా మోస్తారు అంటూ ఆ దంపతుల పెద్ద కూతురు ఫాతిమాను దుండగుడు రాజు ఎత్తుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఫాతిమా ఆకలిగా, ఉందనండంతో దంపతులు పాల కోసం ఒక హోటల్ లోపలికి వెళ్లారు. బయటకి వచ్చి చూసే సరికి దుండగుడు రాజు, ఫాతిమాతో సహా మాయమయ్యాడు. తన కూతురు కిడ్నాప్ గురైందంటూ ఫాతిమా తండ్రి రాజు రాంగోపాల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాట్నీ సెంటర్, నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ కిడ్నాపర్ జాడ దొరకలేదు. దీంతో కిడ్నాప్కు గురైన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు బాలికను అపహరించినట్లు గుర్తించారు. 20 బృందాలు ఏర్పాటు చేసి, నగర వ్యాప్తంగా గాలించారు. సీసీటీవీల ఆధారంగా నిందితుడు ఏ ప్రాంతంలో సంచరించాడో గుర్తించారు.
చివరకు కిడ్నాపర్ గోషామహల్లోని కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే కిడ్నాపర్.. సలీమ్ అనే తన స్నేహితుడికి పిల్లలు లేక బాధపడుతున్నాడని, అతని కోసమే కిడ్నాప్ చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు సలీం ఇంటికి చేరుకుని ఫాతిమాను రక్షించారు. కిడ్నాప్ చేసిన రాజుతోపాటు, సలీమ్ను అరెస్టు చేశారు.