యాప్నగరం

గంటలో పెళ్లి.. ఇంతలో కొట్టుకున్న బంధువులు, మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఊహించని ట్విస్ట్

Secunderabad: జనగామ జిల్లాలోని యశ్వంత్ పూర్ గ్రామానికి చెందిన అనిల్‌కు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు సికింద్రాబాద్‌లోని వెస్లీ చర్చిలో పెళ్ళి జరుగుతోంది.

Samayam Telugu 11 Nov 2020, 8:21 pm
మరో గంటలో వివాహం అనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పెళ్ళిని నిలిపివేశారు. సాధారణంగా ఇటువంటి సన్నివేశం ఎక్కువగా సినిమాల్లోనే కనపడుతుంది. కానీ, ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది. దీంట్లో ట్విస్ట్ ఎంటంటే అబ్బాయిని ప్రేమించిన మరో యువతి.. తనను మోసం చేసి మైనర్ బాలికను వివాహం చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెళ్లిని అడ్డుకున్నారు. అగ్రహానికి లోనైన అమ్మాయి బంధువులు అబ్బాయి తరపు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పచ్చని పెళ్లి పందిరి కాస్త రచ్చ రచ్చ అయింది. దీంతో పోలీసులు పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Samayam Telugu గంటలో జరగనున్న పెళ్లిని ఆపేసిన పోలీసులు
Secunderaba wesley church


వివరాలివీ.. జనగామ జిల్లాలోని యశ్వంత్ పూర్ గ్రామానికి చెందిన అనిల్‌కు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు సికింద్రాబాద్‌లోని వెస్లీ చర్చిలో పెళ్ళి జరుగుతోంది. మరోవైపు, ఘట్ కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన మరో యువతి తనను మోసం చేసి మైనర్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని చైల్డ్ లేబర్, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు చర్చికి చేరుకొని పెళ్ళిని నిలిపివేశారు.

తమ కుమార్తె పెళ్లి నిలిచిపోవడంతో అమ్మాయి తరపు వారు ఆగ్రహంతో అబ్బాయి బంధువులపై దాడి చేశారు. దీంతో పెళ్ళి అర్ధాంతరంగా అగిపోయింది. ఇరువురి కుటుంబాలను పోలీసు స్టేషన్‌కి తరలించారు. అమ్మాయి మైనర్ అని తేలడంతో ఆమె కుటుంబాన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.