యాప్నగరం

వేధింపులతో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. మీర్‌పేటలో విషాదం

Hyderabad: కాలేజీలో వేధింపులకు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న అమ్మాయి ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.

Samayam Telugu 4 Nov 2019, 3:12 pm
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీగల రాంరెడ్డి (టీఆర్‌ఆర్‌) కాలేజీలో పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ చదువుతున్న సంధ్య అనే అమ్మాయి ఆదివారం (నవంబర్ 3) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ యాజమాన్యం బెదిరింపుల వల్లనే సంధ్య ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
Samayam Telugu sandhya
పాలిటెక్నిక్ విద్యార్థిని సంధ్య


Also Read: మొదటి ప్రియుడినే పెళ్లి చేసుకుంటా.. హయత్‌నగర్ కీర్తి

పార్వతి మేడమ్‌ వేధింపులు భరించలేకే సంధ్య ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిటెండ్‌ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తోందని బెబుతున్నారు. సంధ్య మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.