యాప్నగరం

BRS: సస్పెన్షన్‌పై స్పందించిన పొంగులేటి.. ఆయన ఏమన్నారంటే..

BRS Party: బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయటంపై ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దొరల గడీ నుంచి ఇన్ని రోజులకు తనకు విముక్తి లభించిందని చెప్పారు. తనను సస్పెండ్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 10 Apr 2023, 11:57 am

ప్రధానాంశాలు:

  • బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి సస్పెండ్
  • సస్పెన్షన్‌పై స్పందించిన మాజీ ఎంపీ
  • దొరల గడీ నుంచి విముక్తి లభించిందని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ponguleti Srinivas Reddy
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy: పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) పై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గత కొంత కాలంగా ప్రభుత్వం, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇన్ని రోజులకు తనకు విమక్తి లభించిందని చెప్పారు. దొరల గడీ నుంచి విముక్తి లభించినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు.
గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొంది ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో పార్టీకి, పొంగులేటికి మధ్య గ్యాప్ పెరింగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆయన గత కొంతకాలంగా బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని నియోజవర్గాల్లో తన తరపున అభ్యర్థులను సైతం ప్రకటించారు. ఆయన తొలుత బీజేపీ, వైఎస్సాఆర్‌టీపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరతారని ప్రచారం జరగినా.. ఎందులోనూ చేరలేదు.

ఆదివారం కొత్తగూడెంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడిన పొంగులేటి మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు, దళిత సీఎం, మూడెకరాల భూమి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఎస్సీల వర్గీకరణ, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రజలు మూడోసారి అధికారం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి సైతం..ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని.. సీఎంలో నిజాయతీ లోపించిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం వారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More Latest Andhra Pradesh News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.