యాప్నగరం

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండండి..!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నీమధ్యే ఇచ్చిన సడెన్ ఎంట్రీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రైతులు.. మళ్లీ వరుణుడు వస్తున్నాడంటే కొంత ఆందోళనకు గురవుతున్నాయి. అయితే.. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 5 Apr 2023, 12:18 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్
  • రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • ఏప్రిల్ 6న 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu rains-in-telangana
వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూరిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు సూచించారు. ఏప్రిల్ 6 తారీఖున గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. జార్ఖండ్ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో కురిసిన అకాల కుండపోత వర్షాలు, వడగళ్లు బీభత్సం సృష్టించాయి. పంటలన్ని దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతినటంతో.. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కాగా.. మళ్లీ ఇప్పుడు మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని సమాచారం రావటంతో.. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అకాల వర్షాలతో రాష్ట్రంలో పంటలన్ని దెబ్బతినగా.. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా... పంటతో సంబంధం లేకుండా ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ డబ్బులు కూడా వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటన అనంతరం మళ్లీ అధికారులతో సమీక్ష నిర్వహించి.. దెబ్బతిన్న పంటల వివరాలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.