యాప్నగరం

అమిత్‌షా పర్యటన వేళ పోస్టర్ల కలకలం.. చర్చనీయాంశమవుతోన్న 20 ప్రశ్నలు

Amit Shah Hyd Tour: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన వేళ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోస్టర్లు ప్రత్యక్షమవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కారు ఏవిధంగా సహాయం చేసిందో చెప్పాలంటూ.. కంటోన్మెంట్ యువత పేరుతో పోస్టర్లు కనిపించాయి. 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 15 Sep 2022, 11:49 am
Amit Shah Hyd Tour: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోస్టర్లు కలకలం రేపాయి. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day) సందర్భంగా.. అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 16న నగరానికి చేరుకోనున్న అమిత్‌షా.. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ (Hyderabad Parade Grounds) లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో.. అమిత్ షా పర్యటనకు నిరసనగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బుధరవాం అర్ధరాత్రి పోస్టర్లు దర్శనమిచ్చాయి. కంటోన్మెంట్ యువత పేరుతో ప్రత్యక్షమైన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించిన 20 ప్రశ్నలను కేంద్రానికి, ప్రధాని మోదీకి ఎక్కుపెడుతూ వెలిసిన ఈ పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
Samayam Telugu AMIT SHAH POSTERS
అమిత్‌షా పర్యటన వేళ పోస్టర్ల కలకలం


తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో చెప్పాలంటూ.. పోస్టర్లలో బీజేపీ సర్కార్‌కు ప్రశ్నలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడెవరో చెప్పుకోండంటూ పలు ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి. మరోవైపు.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన బీజేపీ నాయకులు వీళ్లే అంటూ ఇంకొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి.
తెలంగాణ విమోచన వజ్రోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని అటు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించగా.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట వేడుకలు నిర్వహించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమవటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరగనుంది.

READ MORE: TELUGU NEWS And TELANGANA NEWS
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.