యాప్నగరం

పోతిరెడ్డిపాడు: జగన్ స్పీడ్‌కు కేంద్రం బ్రేకులు.. సంజయ్ లేఖకు స్పందన

పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం కోసం ఏపీ సర్కారు జీవో జారీ చేయడంపై బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాయగా.. కేంద్రం స్పందించింది.

Samayam Telugu 16 May 2020, 4:03 pm
పోతిరెడ్డిపాడు జలవివాదంపై కేంద్రం స్పందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయమై బండి సంజయ్ ఇటీవలే కేంద్రం జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాయగా మంత్రి బదులిచ్చారు. ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కృష్ణా బోర్డుకు సూచించారు. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించాలని.. అప్పటి వరకు ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అలాగే అపెక్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Samayam Telugu పోతిరెడ్డిపాడు


కృష్ణా జలాలను కాపాడటంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా నదిలో వాస్తవానికి తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉండగా.. కేసీఆర్‌ అసమర్థతతో 299 టీఎంసీలకు పరిమితమైందని ఆయన విమర్శించారు. నదీ జలాల విషయంలో కేసీఆర్‌ సరైన వాటా సాధించలేకపోయారన్నారు.

కృష్ణా నది నుంచి 150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్న సంజయ్.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. టెలిమెట్రిక్‌లను ఏర్పాటు చేయడంలో కూడా కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు.

Read Also: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు
Read Also: ఒకే బాత్రూమ్.. 15 మందికి కరోనా పాజిటివ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.