సినీ నటుడు ప్రభాస్కు సంబంధించిన స్థలం విషయమై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 2083 చదరపు గజాల స్థలానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదం ఓ కొలిక్కి వచ్చే వరకు ఆ స్థలాన్ని ప్రభాస్కు అప్పగించాల్సిన అవసరం లేదని.. అక్కడ ఉన్న నిర్మాణాన్ని కూడా కూల్చేయొద్దని సూచించింది. ప్రభాస్ పిటిషన్పై కింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ను ఎత్తివేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశించింది.
ఇంతకూ ఏమైందంటే..
రాయదుర్గం సమీపంలోని పాన్ మక్త గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనని గతంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ గెస్ట్హౌస్ ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై 2018లో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల కూకట్పల్లి 15వ అదనపు జిల్లా కోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ప్రభాస్ ఏప్రిల్ 3న ఆ భవనం తాళం తీయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ పోలీసులతో వెళ్లి భవనానికి తిరిగి లాక్ వేశారు. ఇంజంక్షన్ ఉత్తర్వులను తొలగించాలంటూ అధికారులు కింది కోర్టులో దరఖాస్తు చేశారు. కింది కోర్టు విచారణ చేపట్టకపోవడంతో రెవెన్యూ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆస్తి ప్రభాస్ అధీనంలో ఉండటం సరికాదని చెప్పింది. ఇరుపక్షాలు తమ వాదనలను కింది కోర్టుకు చెప్పాలని, ఆ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది.
ఇంతకూ ఏమైందంటే..
రాయదుర్గం సమీపంలోని పాన్ మక్త గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనని గతంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ గెస్ట్హౌస్ ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై 2018లో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల కూకట్పల్లి 15వ అదనపు జిల్లా కోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ప్రభాస్ ఏప్రిల్ 3న ఆ భవనం తాళం తీయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ పోలీసులతో వెళ్లి భవనానికి తిరిగి లాక్ వేశారు. ఇంజంక్షన్ ఉత్తర్వులను తొలగించాలంటూ అధికారులు కింది కోర్టులో దరఖాస్తు చేశారు. కింది కోర్టు విచారణ చేపట్టకపోవడంతో రెవెన్యూ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆస్తి ప్రభాస్ అధీనంలో ఉండటం సరికాదని చెప్పింది. ఇరుపక్షాలు తమ వాదనలను కింది కోర్టుకు చెప్పాలని, ఆ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది.