అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల పరిస్థితి క్లిష్టంగా మారిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ బేగంపేటలో బుధవారం మీటింగ్ పెట్టబోతున్నట్లు చెప్పారు. దీనికి అందరూ నేతలను ఆహ్వానించానన్నారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు.
మంద కృష్ణ మాదిగ తనకు ఫోన్ చేసి పార్లమెంట్లో మాదిగల పోరాటానికి మద్దతు కోరారన్న పాల్.. ఆయన తీరుపై మండిపడ్డారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. అందుకే అతనికి పదవీ ఇస్తానని ఆఫర్ చేశారు. విద్యావంతులు తన పార్టీలో చేరాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయనన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ చోట్ల పోటీ చేస్తుందని తెలిపారు. అందుకే విద్యావంతులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానన్నారు.
ఇప్పటిదాకా దోచుకునే వారికే అవకాశం ఇచ్చారన్న ఆయన.. సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంటే భయమని విమర్శించారు. దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలేనని చెప్పుకొచ్చారు. తన వెనుక బీజేపీ ఉందంటూ వస్తున్న ఆరోపణలు అర్థహితమని పాల్ అన్నారు. అవి పనిలేని కొందరు చేస్తున్న విమర్శలేనని కొట్టిపారేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.
మంద కృష్ణ మాదిగ తనకు ఫోన్ చేసి పార్లమెంట్లో మాదిగల పోరాటానికి మద్దతు కోరారన్న పాల్.. ఆయన తీరుపై మండిపడ్డారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. అందుకే అతనికి పదవీ ఇస్తానని ఆఫర్ చేశారు. విద్యావంతులు తన పార్టీలో చేరాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయనన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ చోట్ల పోటీ చేస్తుందని తెలిపారు. అందుకే విద్యావంతులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానన్నారు.
ఇప్పటిదాకా దోచుకునే వారికే అవకాశం ఇచ్చారన్న ఆయన.. సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంటే భయమని విమర్శించారు. దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలేనని చెప్పుకొచ్చారు. తన వెనుక బీజేపీ ఉందంటూ వస్తున్న ఆరోపణలు అర్థహితమని పాల్ అన్నారు. అవి పనిలేని కొందరు చేస్తున్న విమర్శలేనని కొట్టిపారేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.