యాప్నగరం

తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై అమృత రియాక్షన్ ఇదే..

Maruthi Rao suicide: 2018లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 8 Mar 2020, 4:23 pm
ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై అతని కూతురు అమృత స్పందించింది. తన తండ్రి ఆత్మహత్యపై తాను ఇప్పుడే ఏం మాట్లాడలేనని చెప్పింది. హైదరాబాద్‌లో మారుతీరావు చనిపోయాడనే వార్త తెలిసిన వెంటనే విలేకరులు అమృతను సంప్రదించారు. ఈ క్రమంలో స్పందించిన అమృత.. ‘నాన్న ఆత్మహత్యపై నాకు క్లారిటీ లేదు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ పరిణామం ఎలా జరిగిందో తెలియదు. బహుశా చేసిన తప్పు తెలుసుకొని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చేమో. నేను ఇప్పుడే ఏమీ స్పందించలేను. ఈ వార్త మీడియా ద్వారానే మాకు తెలిసింది’’ అని చెప్పింది. దీని గురించిన అన్ని వివరాలు తెలిశాక మాట్లాడతానని అమృత అన్నారు.
Samayam Telugu maruthi rao sucide amrutha


Also Read: మారుతీరావు ఆత్మహత్య: వీలునామానే కొంపముంచిందా? సంచలన అనుమానాలు

2018లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని చింతల్‌ బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్‌లో మారుతీరావు శనివారమే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం సిబ్బంది చూసేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మారుతీరావు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Also Read: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.