యాప్నగరం

ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన.. మరి తెలంగాణలో షర్మిల సంగతేంటో..!

YS Sharmila: ‘‘నేను ఇప్పటికే చాలా చేశాను. బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. జీవితంలో ఇంకేదో చేయాలి. ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’’ అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

Samayam Telugu 2 May 2021, 5:11 pm
దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఖ్యాతి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ తాజా ఫలితాలతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని త్రుణమూల్ కాంగ్రెస్‌కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ తదుపరి ప్రాజెక్టు గురించి సాధారణంగా ఆసక్తి ఉంటుంది. కానీ, ఇందుకు భిన్నంగా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోనని ఓ నేషనల్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sharmila prashanth kishore


‘‘నేను ఇప్పటికే చాలా చేశాను. బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. జీవితంలో ఇంకేదో చేయాలి. ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’’ అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిలకు ఆయనే వ్యూహకర్తగా ఉంటారని గతంలో చర్చ జరిగింది. కొంత కాలం విజయవాడలో పార్టీకి సంబంధించి చర్చలు కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకొంటున్నట్టు పీకే ప్రకటించడం వైఎస్ షర్మిలకు కాస్త కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. పార్టీ పేరు, జెండా, అజెండాలను కూడా అప్పుడే ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో కొత్త పార్టీ అనే వార్త మొదలయినప్పటి నుంచి షర్మిల ఓ పద్ధతి ప్రకారమే వ్యూహాత్మకంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ఇదంతా పీకే ఆలోచనలు ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, తాజాగా ప్రశాంత్ కిషోర్ ఈ రంగం నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.