యాప్నగరం

సమయానికి వైద్యం అందక నిండు గర్భిణి మృతి

వైద్యులు అందుబాటులో లేక నిండు గర్భిణిని ఆస్పత్రుల కోసం తిప్పారు. ఈ లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పురిటినొప్పులతో వైద్యం అందక నరకయాతన అనుభవించి చివరకు ప్రాణం విడిచింది.

Samayam Telugu 4 Mar 2021, 3:18 pm
సమయంకు సరైన వైద్యం అందక ఓ గర్భిణి మహిళ మృతి చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి మృతి చెందింది. తిమ్మాపూర్‌కు చెందిన మహిళ డెలివరీ కోసం నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ అక్కడ లేకపోవడంతో రెండు రోజులు ఆస్పత్రిలోనే పడిగాపులు కాశారు. ఆ తర్వాత మహిళకు పురిటినొప్పులు రావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu గర్భిణి మృతి


అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గాంధీకి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మహిళ మృతి చెందింది. మహిళ మృతదేహన్ని నర్సాపూర్‌ ఆస్పత్రి తీసుకొచ్చి బంధువులు ఆందోళన నిర్వహించారు. సరైన సమయంలో డాక్టర్‌ లేకపోవడంతోనే గర్భిణీ చనిపోయిందని ఆరోపించారు. గర్భిణీ మృతికి కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.