యాప్నగరం

ఆర్టీసీ బస్సులోనే గర్భిణీ ప్రసవం.. కాన్పు చేసిన తోటి ప్రయాణికులు

Jogulamba Gadwal: బస్సు ఎక్కిన కాసేపటికే గర్భిణీకి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఇది గమనించిన డ్రైవర్ బస్సును గట్టు ప్రభుత్వాసుపత్రి వైపు తిప్పారు. పది నిమిషాల్లో గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతామనేలోపే.. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.

Samayam Telugu 27 May 2020, 3:33 pm
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణీ ప్రసవించింది. ఈ సంఘటన గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌ దొడ్డి గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణీ బుధవారం ఆరగిద్ద నుంచి గట్టుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఈ క్రమంలో మధ్యలోనే పురిటి నొప్పులు మొదలై ప్రసవించింది.
Samayam Telugu ఆస్పత్రి ముందు నిలిపిన బస్సు
jogulamba gadwal


Must Read: తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే రాకాసి మిడతలు.. పొంచి ఉన్న దాడి ముప్పు.. అదే జరిగితే..

ఆరగిద్ద-గట్టు ఆర్టీసీ బస్సు ఎక్కిన కాసేపటికే గర్భిణీకి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఇది గమనించిన డ్రైవర్ బస్సును గట్టు ప్రభుత్వాసుపత్రి వైపు తిప్పారు. పది నిమిషాల్లో గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతామనేలోపే.. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. మొత్తానికి డ్రైవర్‌ సకాలంలో ఆస్పత్రి వద్దకు బస్సు తీసుకెళ్లాడు. కానీ బస్సు నుంచి దిగకముందే.. గర్భిణీకి ప్రసవం జరిగింది. ఆమె పంటంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళలు ఆమెకు కాన్పు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రి లోనికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.