యాప్నగరం

ప్రసవం కోసం పది కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గర్భిణిలు సాహసం చేయాల్సి వస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల దూరం నడుస్తూ.. వాగులు వంకలు దాటాల్సి వస్తోంది.

Samayam Telugu 13 Jun 2020, 10:32 am
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం పది కి.మీ. దూరం నడవాల్సి వచ్చింది. పురిటి నొప్పులను పంటి బిగువన భరిస్తూనే.. ఒంట్లో ఓపిక లేకున్నా ఆమె ఓ వాగు దాటాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు డయల్ చేసి సమాచారం అందించారు.
Samayam Telugu నమూనా చిత్రం
pregnant woman


గుండాల నుంచి అంబులెన్స్ నుంచి రోళ్లగడ్డ రావాలంటే మధ్యలో మల్లన్న వాగు దాటాల్సి ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు మల్లన్న వాగు పొంగి ప్రవహిస్తుండటంతో... అంబులెన్స్ రావడానికి అవకాశం లేకపోయింది. దీంతో అంబులెన్స్ దగ్గరకు వెళ్లడానికి ఆ నిండు గర్భిణి పది కి.మీ. నడిచి వాగును దాటాల్సి వచ్చింది. అనంతరం ఆమెను ఖమ్మం తరలించగా.. మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు తరచుగా చోటు చేసుకుంటుంటాయి. గ్రామస్థులు డోలె కట్టి గర్భిణులను వాగు దాటిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది గర్భిణులకు ప్రసవం కావడంతోపాటు తల్లిబిడ్డకు ప్రమాదకరంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.