యాప్నగరం

ఈ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎంతో పవిత్రం.. రాష్ట్రపతి

Ramnath Kovind రంగారెడ్డి జిల్లా కన్హ గ్రామంలోని ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు.

Samayam Telugu 2 Feb 2020, 1:32 pm
హైదరాబాద్ శివారులో ఇటీవల ప్రారంభమైన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ సతీ సమేతంగా సందర్శించారు. రామచంద్ర మిషన్ 75వ వసంతోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతివనంలో అతి పెద్ద ధ్యాన కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కోవింద్ మాట్లాడారు.
Samayam Telugu Capture
Picture Credit: President of India/Twitter


Also Read: మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు షురూ.. ధరెంతో తెలిస్తే షాక్

శాంతివనంలో ఉన్న లక్ష మొక్కలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇది ఎంతో పవిత్రమైన స్థలమని వ్యాఖ్యానించారు. రామచంద్ర మిషన్ 150 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉందని, ధ్యాన కేంద్రాల్లో లక్షల మంది జనం అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. బుద్ధ, మహావీర్‌, నానక్‌, కబీర్‌, వివేకానంద ఆధ్యాత్మిక ప్రతినిధులని కోవింద్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, యూపీ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగి టిక్‌టాక్.. వెకిలిగా అమ్మాయిలతో..

ఆలోచనలను నియంత్రించడమే ధ్యానం అని గురూజీ కమలేశ్ అన్నారు. ఒత్తిడిలో ఉన్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా జీవించలేరని గురుజీ కమలేష్ పటేల్ అన్నారు. యోగా, ధ్యానం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఎంతో ఊరటనిస్తాయని చెప్పారు. ఆలోచనలను నియంత్రించడం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారు.

Also Read: మా అమ్మను కిడ్నాప్ చేశారు.. కేటీఆర్‌కు యువతి ట్వీట్
Must Read: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి సీతారామన్ అరుదైన రికార్డు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.