యాప్నగరం

కరోనా చికిత్సకు రోజుకి 70 వేలు.. సర్కార్ కోరిన ప్రైవేటు ఆస్పత్రులు

Etala Rajender: ‘‘ప్రజల విజ్ఞప్తి మేరకే ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా చికిత్సకు అనుమతిస్తున్నాం. ఐసీయూలో ఉండే రోగులకు కూడా ప్రభుత్వం నిర్దేశిత రేట్ల ప్రకారమే చికిత్స అందించాలి.’’ అని ఈటల అన్నారు.

Samayam Telugu 18 Jun 2020, 9:11 pm
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టు‌లు, చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంపై ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై చర్చించేందుకు వారు గురువారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటలతో‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెంచాల్సిందేనని ఆస్పత్రుల అసోసియేషన్‌ మంత్రి ఈటలను కోరారు. కాగా, వారి వినతిని ప్రభుత్వం తిరస్కరించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Minister Etela Rajender


కరోనా చికిత్సకు రోజుకు రూ.70 వేల ఫీజు చెల్లిస్తే తప్ప మెరుగైన చికిత్స అందించలేమని ప్రైవేట్ ఆస్పత్రులు మంత్రికి వివరించాయి. కరోనా చికిత్స విషయంలో తాము రాజీపడబోమని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘‘ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రైవేటు ఆస్పత్రులపై ఉంది. కరోనా పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరి కాదు. కరోనా పాజిటివ్ ఉన్నా కూడా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలి. లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లోనే ఉంచాలి.’’

Also Read: టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు బాత్రూంలు క్లీన్ చేయండి.. డిపో మేనేజర్ ఆర్డర్

‘‘ప్రజల విజ్ఞప్తి మేరకే ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా చికిత్సకు అనుమతిస్తున్నాం. ఐసీయూలో ఉండే రోగులకు కూడా ప్రభుత్వం నిర్దేశిత రేట్ల ప్రకారమే చికిత్స అందించాలి. పీపీఈ కిట్ల వినియోగం, మందుల వినియోగానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తీసుకోవాలి.’’ అని ఈటల స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రభుత్వం చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని మంత్రిని కోరాయి. ఆ బకాయిలు త్వరలో చెల్లిస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు.

Also read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.