యాప్నగరం

TS: కరోనా వేళ దిగొచ్చిన కార్పొరేటు ఆస్పత్రులు.. సంచలన నిర్ణయం

Telangana Coronavirus: ఈ సంక్షోభ సమయంలో వ్యాపారం చేయవద్దని పలు మార్లు మంత్రి ఈటల రాజేందర్ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను గతంలోనే కోరారు. గురువారం కూడా కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశం అయ్యారు.

Samayam Telugu 13 Aug 2020, 10:32 pm
కరోనా చికిత్స పేరుతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆ ఆస్పత్రులు అంగీకరించాయి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా చార్జీలు చేయడంతో ప్రభుత్వానికి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్నింటికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.
Samayam Telugu కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి సమావేశం
Private hospitals in hyderabad takes sensational decision over corona treatment


అయితే, ఈ సంక్షోభ సమయంలో వ్యాపారం చేయవద్దని పలు మార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను కోరారు. గురువారం కూడా కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశం అయ్యారు. కరోనా చికిత్స అందించేందుకు ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో 50 శాతం పడకలను ప్రభుత్వానికి అందించేందుకు వారు అంగీకరించారు. వీటిలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు.

Also Read: undefined

ప్రత్యేక యాప్ ద్వారా ఆయా ఆస్పత్రులకు పేషంట్లను వైద్య ఆరోగ్య శాఖ పంపించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ అంగీకరించాయి. 50 శాతం పడకలు ప్రభుత్వానికి అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌కు మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావుతో రేపు భేటీ అవ్వాలని హాస్పిటల్ యాజమాన్యాలను మంత్రి కోరారు.

Must Read: రాత్రంతా వానలోనే కొడుకు శవం, ఉదయానికి తల్లి మృతి.. అక్కడ తీవ్రంగా కరోనా భయం

ఈ సమావేశంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Must Read: ప్రణబ్‌ ముఖర్జీపై తొందరపడ్డ టీఆర్ఎస్ మాజీ ఎంపీ.. వెంటనే ట్వీట్ డిలీట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.