యాప్నగరం

నల్గొండలో దారుణం.. ప్రెయివేటు టీచర్ ఆత్మహత్య

ఆరునెలలుగా స్కూల్స్ బంద్ కావడంతో.. సొంతూరులోనే వ్యవసాయం మొదలుపెట్టాడు వెంకట్. దాదాపు మూడు లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి పంట వేశాడు.

Samayam Telugu 5 Oct 2020, 7:29 am
ప్రయివేటు టీచర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు అతని ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రివెంకట్‌ (30) పీజీ చేశాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో నార్కట్‌పల్లిలోని లిటిల్‌ ప్లవర్‌ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా విద్యా సంస్థలన్నీ బంద్ అయిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
private teacher suicide


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏడు నెలలుగా పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో వేతనాలు రాక కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. కరోనాతో ఉన్న ఉద్యోగం కోల్పోవడంతో తన గ్రామంలోనే నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటంతా జాలుబారింది. దాంతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చేటట్టు కన్పించలేదు. పైగా పంటసాగు కోసం చేసిన సుమారు రూ.3లక్షల అప్పులు ఎలా తీర్చాలో, అర్థం కాక ఆందోలనకు గురయ్యాడు వెంకట్.

Read More:గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం కప్పు.. 10 మందికి తీవ్ర గాయాలు

కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పత్తి చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూసేసరికి మృతి చెందాడు. మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే వెంకట్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.