యాప్నగరం

ఎమ్మెల్సీ బరిలోకి ప్రొఫెసర్ నాగేశ్వర్.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

గతంలో కూడా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన నాగేశ్వర్ విజయం సాధించారు 2014 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.

Samayam Telugu 1 Oct 2020, 8:37 am
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. గతంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా పనిచేశారు. 2007, 2009లలో ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.
Samayam Telugu ప్రొఫెసర్ నాగేశ్వర్
prof nageshwar


ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోటీ చేసే అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం కూడా ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నట్లు తెలిసింది. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదు.

Read More: Himanshu Rao: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు.. ఆస్పత్రిలో చేరిక

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి రేపట్నుంచి ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నారు అధికారులు. మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 6వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. www.ceotelangana.nic.in అనే వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి పంకజ వెల్లడించారు. గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గ ఓటరుగా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.