యాప్నగరం

తెలంగాణ కేసీఆర్ ఒక్కరి సొత్తు కాదు: కోదండ రామ్

Telangana సీఎం కేసీఆర్‌పై ప్రొఫెసర్ కోదండ రామ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల బతుకులు మారుతాయనుకుంటే.. కేసీఆర్ ఇల్లు మారిందని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 15 Sep 2019, 6:07 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండ రామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారంతా ప్రస్తుతం కేసీఆర్‌కు మిత్రులుగా మారారని సెటైర్లు వేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరి తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి కోసం మరో ఉద్యమం తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.
Samayam Telugu Kodanda Ram


తెలంగాణ వచ్చాక ప్రజల బతుకులు మారుతాయనుకుంటే.. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్‌కు మారిందని కోదండ రామ్ ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్‌లో మెగా కృష్ణారెడ్డికి మాత్రమే ప్రవేశం దక్కుతోందని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం ఉద్యమం తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ అప్పట్లోనే చెప్పారని కోదండ రామ్ గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణపై తనొక్కడికే హక్కు ఉన్నట్లు కేసీఆర్ భావించడం సరికాదని సూచించారు.

పాలకుల దోపిడీ తత్వాన్ని ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కోదండ రాం. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పదవుల మీద ఆశలు లేవని రాష్ట్రాభివృద్ది ఎజెండాగా పనిచేస్తానని కోదండరామ్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.