యాప్నగరం

సంక్షేమానికి మద్యమే ఎలా ఆజ్యం పోస్తుందో.. సర్కార్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ సెటైర్లు

మద్యం విషయంలో తెలంగాణ సర్కార్ నిర్ణయాలపై మేధావులు మండిపడుతున్నారు. మద్యం అమ్మగా వచ్చిన సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన దుస్థితి వచ్చిందంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు దీనిపై స్పందించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 20 May 2022, 3:36 pm
తెలంగాణలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా రూ.వేల కోట్లు ఆదాయం వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సర్కార్ మద్యం రేట్లు పెంచింది. అయితే తెలంగాణ సర్కార్ నిర్ణయాలపై మేధావులు, సామాజికవేత్తలు దుమ్మెత్తి పోస్తు్న్నారు. రాష్ట్రంలో మద్యం తాగే వారు పెరిగేందుకు సర్కార్ నిర్ణయాలే కారణమని మండిపడుతున్నారు. చివరికి మద్యం అమ్మగా వచ్చిన సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఎత్తిపొడుస్తున్నారు.
Samayam Telugu నాగేశ్వర్


తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు కూడా దీనిపై స్పందించారు. ‘తెలంగాణలో గత ఏడేళ్లలో మద్యం అమ్మకాలు డబుల్ అయ్యాయి. తాగి తాగి కాలేయం చెడిపోతే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందివచ్చు. అయినప్పటికీ ప్రాణం పోతే.. వితంతు ఫించన్ ద్వారా ఆదుకోవచ్చు. సంక్షేమానికి మద్యపానమే ఎలా ఆజ్యం పోస్తుందో..’ అంటూ సైటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.