యాప్నగరం

స్పీకర్ పోచారం, ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్ సహా కీలక నేతలకు కోర్టు సమన్లు

Pocharam Srinivas Reddy: 2005 నాటి టీడీపీ నిరసన కార్యక్రమం కేసులో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్ సహా కీలక నేతలకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

Samayam Telugu 22 Feb 2021, 6:48 pm
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2005లో టీడీపీ నిర్వహించిన ఆందోళన కేసులో న్యాయస్థానం పోచారం సహా పలువురు నేతలకు సమన్లు జారీ చేసింది. వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసు ఇటీవలే వరంగల్ కోర్టు నుంచి ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది.
Samayam Telugu జడ్జిమెంట్
Judgment


వరంగల్ కేసుకు సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరికి సమన్లు జారీ అయ్యాయి. వీరితో పాటు ఎస్ వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో వీరంతా కీలక నేతలుగా ఉన్నారు. ప్రస్తుతం వేర్వేరు పార్టీలలో ఉన్నారు.

వాద ప్రతివాదనలు విన్న తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టు ఈ నేతలందరినీ మార్చి 4న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎంఐఎం నేత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.