యాప్నగరం

కృష్ణా నది పుట్టి ప్రమాదం.. జూరాల ప్రాజెక్టు వద్ద మరో మృతదేహం లభ్యం

ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టు మూడు మృతదేహాల కొట్టుకొచ్చాయి. కృష్ణా నదిలో పుట్టి మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.

Samayam Telugu 20 Aug 2020, 5:44 pm
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. అయితే మూడు రోజుల క్రితం కృష్ణా నదిలో జరిగిన ఈ ప్రమాదంలో తాజాగా మరో మృతదేహం జూరాల ప్రాజెక్టు వద్ద కొట్టుకొచ్చింది. నిన్న రెండు మృతదేహాలు కొట్టుకు రాగా.. ఇవాళ మరో శవం కొట్టుకొచ్చింది. గురువారం పొద్దున్నే మరో మృతదేహం బయటపడింది. వీటిని మొన్నటి ప్రమాదానికి గురైన వారి శవాలుగా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపులు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Samayam Telugu జూరాల ప్రాజెక్టు
jurala project


పస్పల నుంచి కురవపురంకు కొంత మంది పుట్టిలో వెళ్తుండగా వరద ప్రవాహంలో పుట్టి నీట మునిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందిని మరో పుట్టిన ప్రయాణిస్తున్నవారు కాపాడారు. అయితే, ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు నదిలో గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన వారు కురవపురానికి చెందిన తల్లి సుమలత, కుమార్తె రోజా, పార్వతమ్మ, నరసమ్మగా గుర్తించారు.
Read More: 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
మరోవైపు తెలంగాణలో ఐదారురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఓ టీఆర్ఎస్ నేత కూడా కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. స్నేహితులతో వెళ్తున్న టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్.. కారు వరదలో కొట్టుకుపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.