యాప్నగరం

మహబూబ్ నగర్: చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కింది

చేపల కోసం వల వేసిన స్థానికులు.. వలలో చిక్కుకున్న 11 అడుగుల పొడవున్న కొండ చిలువ. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలి వేసిన స్నేక్‌ సొసైటీ సభ్యులు.

Samayam Telugu 24 Oct 2020, 8:06 am
మహబూబ్‌నగర్ జిల్లాలో కొండ చిలువ కలకలంరేపింది. పెద్దమందడి మండలంలోని మనిగిళ్ల గ్రామ చెరువులో లక్ష్మయ్య, శేఖర్‌ చేపల కోసం వల వేశారు. వలలో కొండచిలువ చిక్కుకుంది. వెంటనే గుర్తించి స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి బంధించారు. కొండచిలువ 11 అడుగుల పొడవు ఉందని.. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాములు బెడద పెరిగింది. ఇలాంటి ఘటనలు రెండు, మూడు జరిగాయి.
Samayam Telugu వలలో కొండ చిలువ


గుంటూరు జిల్లాలో కూడా కొండచిలువ కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు, చేపలు వరద నీటిలో పొలాల వైపు కొట్టుకొని వస్తున్నాయి. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అటవీశాఖ అధికారులు ఆ కొండ చిలువను పట్టుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండ చిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.