యాప్నగరం

మంత్రి మల్లారెడ్డిపై మహిళ ఫిర్యాదు

TRS: మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Samayam Telugu 17 Feb 2020, 5:56 pm
Samayam Telugu malla reddy.
మంత్రి మల్లారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సోమవారం (ఫిబ్రవరి 17) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారంలో మంత్రి మల్లారెడ్డికి రెండు ఆస్పత్రులు ఉన్నాయి. ఆ ఆస్పత్రుల మధ్యలో తనకు ఒక ఎకరం 33 గుంటల భూమి ఉందని.. దాన్ని కబ్జా చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు పి శ్యామలా దేవి సంచలన ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర హెచ్‌ఆర్సీని కోరారు.

రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు కూడా మంత్రికి మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తనకు రక్షణ కల్పించాలని కమిషన్‌ను వేడుకున్నారు.

Also Read: రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దాం: మంత్రి హరీశ్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.