యాప్నగరం

బూట్లు తీసి, చేత్తో పట్టుకొని వెళ్లిన సీపీ.. మార్కెట్‌లో ఆసక్తికర సీన్

telangana lockdown news: వీరు వచ్చే సమయానికి పండ్ల మార్కెట్‌లోని మామిడి పంట అంతా రాసులు రాసులుగా పోసి ఉంది. అవతలి వైపునకు కింది స్థాయి సిబ్బంది, ఇతర అధికారులు వాటిపై నుంచీ అలాగే వెళ్లిపోయారు.

Samayam Telugu 29 Apr 2020, 5:45 pm
పోలీసులు అంటేనే బయటివారి పట్ల కాస్త కఠిన మనస్తత్వంతో ఉంటారని చాలా మంది అనుకుంటారు. వారు చేసే పనిలో కొన్ని సందర్భాల్లో అలా వ్యవహరిస్తేనే సమాజం నేరరహితంగా ఉంటుంది. అయితే, బుధవారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వల్ల ఇక్కడ పలు ఏర్పాట్లు, రక్షణ చర్యలను పర్యవేక్షించడానికి పోలీసులు కూడా వచ్చారు. ఈ ప్రాంతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో ఆ ప్రాంత పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ కూడా ఇక్కడికి చేరుకున్నారు.
Samayam Telugu మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్


వీరు వచ్చే సమయానికి పండ్ల మార్కెట్‌లోని మామిడి పంట అంతా రాసులు రాసులుగా పోసి ఉంది. అవతలి వైపునకు కింది స్థాయి సిబ్బంది, ఇతర అధికారులు వాటిపై నుంచీ అలాగే వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాత్రం అలా కాకుండా తన బూట్లు విడిచి వెళ్లారు. విడిచిన బూట్లను చేతితో పట్టుకొని, జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకెళ్లారు.

Also Read: undefined

రైతు కష్టపడి పండించిన పంట.. అంతేకాకుండా అందరూ తినే పదార్థం అని భావించి కమిషనర్ ఇలా వ్యవహరించారు. తన మృదుస్వభావం, మంచి మనసును సీపీ ఇలా చాటుకున్నారు. ఇంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన చేసిన పనిని చూసి చాలా మంది కింది స్థాయి అధికారులు తదితరులు తల దించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.