యాప్నగరం

వీడియో: మంటల నుంచి పశువులను కాపాడిన పోలీసులు.. హ్యాట్సాఫ్ అంటున్న జనం

Yadadri Bhongir: లాక్‌డౌన్ విధుల్లో అటుగా వెళ్తున్న పోలీసులు పశువుల కొట్టంలో మంటలు చెలరేగడం చూశారు. ఆ పక్కనే దీనంగా చూస్తున్న మూగజీవులను గమనించి వెంటనే కాపాడారు. శెభాష్ తెలంగాణ పోలీసులు అంటున్నారు.

Samayam Telugu 22 Apr 2020, 4:43 pm
రోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన వేళ.. ప్రజల రక్షణ కోసం కీలక విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ మంచి పనులతో జనం హృదయాల్లో చోటు సంపాదించుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ఈ విషయంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తగులబడుతున్న గడ్డివాముల మధ్య చిక్కుకున్న పశువులను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu cop


రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జిల్లా రామన్నపేట పోలీసులు విధి నిర్వహణలో భాగంగా కక్కిరేణి గ్రామం వెళ్లి తిరిగి పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా.. ఇస్కిళ్ల గ్రామ శివారులో పశువుల కొట్టం దగ్ధం అవుతుండటాన్ని గమనించారు. ఆ సమయంలో పశువుల కొట్టంలో కట్టేసిన మూగజీవాలు మంటలకు తాలలేక విలవిల్లాడటం చూసి వెంటనే వాహనాన్ని నిలిపేసి వాటిని కాపాడారు.

కానిస్టేబుళ్లు పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి ధైర్య సాహసాలు ప్రదర్శించి సకాలంలో స్పందించడంతో మూగజీవాలు ప్రాణాలతో బయటపడ్డాయి. లేకపోతే.. లాక్‌డౌన్‌కు తోడు ఎండ పెరగడంతో నిర్మానుష్యంగా మారిన ఆ ప్రాంతంలో వాటిని ఎవరూ గమనించి ఉండేవారు కాదు. కాపాడటానికి పరుగెత్తుకొచ్చిన కానిస్టేబుల్‌ను చూసి గందరగోళానికి గురైన ఓ గేదె పొడవటానికి ప్రయత్నించినా.. కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి దాని తాడు విప్పడం గమనార్హం.

మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండటం, అక్కడే మరో నాలుగైదు గడ్డివాములు ఉండటం గమనించిన కానిస్టేబుల్ యాదగిరి.. పశువుల పేడతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడం ఆకట్టుకుంటోంది. పోలీసుల చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.

Also Read: కరోనా టీకా తయారీ రేసులో ముందు వరసలో తెలంగాణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.