యాప్నగరం

దుబ్బాక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్ రావు

Siddipet Incident: దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రఘునందన్‌రావు మామ అంజన్‌రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు.

Samayam Telugu 12 Nov 2020, 4:35 pm
సిద్దిపేట ఘటనపై దుబ్బాకలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎలక్షన్ సమయంలో పోలీసులు రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని రఘునందన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద విచారణకు వచ్చింది. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి కోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు.
Samayam Telugu రఘునందన్ రావు
raghunandanrao


దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రఘునందన్‌రావు మామ అంజన్‌రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. అయితే, అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్ తెలిపారు. రఘునందన్‌ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని జోయల్‌ డేవిస్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.