యాప్నగరం

షాద్‌నగర్ ఐశ్వర్య ఆత్మహత్యపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

ఐశ్వర్య బాగా చదివి ఐఏఎస్ కావాలనుకుంది. కాని ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలను చెదరగొట్టాయి. తన కుటుంబానికి తన చదువు భారం కాకూడదని ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 9 Nov 2020, 2:48 pm
షాద్ నగర్ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ సెకండీయర్ చదువుతున్న ఐశ్వర్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్లరద్దు, లాక్ డౌన్‌ అనేకమంది ఇళ్లను నాశనం చేశాయన్నారు.
Samayam Telugu రాహుల్ గాంధీ


షాద్‌ నగర్‌ శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యా రెడ్డి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో బీఎస్సీ సెకండియర్‌ చదువుతోంది. ఐశ్వర్య తండ్రి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఐశ్వర్యకు ఐఏఎస్ కావాలన్నది కోరిక. దీంతో తనను చదివించేందుకు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని ఐశ్వర్య చూడలేకపోయింది. దీంతో సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన చదువు వల్ల తన పేరెంట్స్ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తన చదువు వారికి భారం కాకూడదని బలవన్మరణానికి పాల్పడింది.

Read More: మంచినీరు తాగి 11మందికి అస్వస్థత.. ఒకరు మృతి

ఈ నెల 3నే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్లో ఐశ్వర్యకు 98 శాతం మార్కులు వచ్చాయి. దీంతో గతేడాది డిగ్రీ కోసం మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. హాస్టల్ లో ఉండి చదువుతున్న ఐశ్వర్య హాస్టల్ యాజమాన్యం వేధింపులతో ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కరోనా కారణంగా...బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.