యాప్నగరం

తెెలంగాణకు మరో ఐదురోజుల పాటు వర్షాలు

ఇంటీయర్‌ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Samayam Telugu 13 Apr 2021, 7:40 am
తెలంగాణలో వాతావరణం చల్లగా మారింది. పలుచోట్ల వర్షాలు కురవడంతో వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక, మరాఠ్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఇంటీయర్‌ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్‌వరకు మరో ఉపరితలద్రోణి ఏర్పడింది.
Samayam Telugu తెలంగాణలో వర్షాలు


ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. బుధవారం గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సోమవారం హైదరాబాద్‌ సహా 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు వాన కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ధాన్యం తడువగా, మామిడికాయలు రాలిపోయాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మెదక్‌ జిల్లాలో పిడుకుపాటుకు ఒకరు మృతి చెందారు. మూగజీవాలు కూడా ప్రా ణాలు కోల్పోయాయి. మరికొన్ని చోట్ల కోతకొచ్చిన పంట ఒరిగిపోయి.. ధాన్యం రాలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.