యాప్నగరం

నీట మునిగిన 100 రైఫిళ్లు.. గగన్ నారంగ్ అకాడమీలోకి వరద

ఇటీవలే జర్మనీ నుంచి ఈ రైఫిళ్లను గగన్ నారంగ్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దాదాపు కోటికు పైగా ఖర్చుతో వాటిని ఆయన సొంత ఖర్చుతో తీసుకొచ్చారు. అవన్నీ నీట మునగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 17 Oct 2020, 8:15 am
భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం నీటిమయం అయిన విషయం తెలిసిందే. దీంతో సిటీలో దాదాపు అన్ని ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీ వరద నీరు నేపథ్యంలో షూటర్ గగన్‌ నారంగ్‌ రైఫిళ్లు కూడా నీట మునిగాయి. తిరుమల్‌గిరిలోని నారంగ్‌కు చెందిన ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’ అకాడమీ వరద నీటిలో మునిగిపోయింది. అత్యాధునిక 90 రైఫిళ్లు, పిస్టళ్లలో నీళ్లు చేరాయి.
Samayam Telugu నీటిలో తడిసిన రైఫిళ్లు, పిస్తోల్
gagan narang academy


రూ.1.30 కోట్ల సొంత ఖర్చుతో జర్మనీ నుంచి రైఫిళ్లు దిగుమతి చేశారు. నవంబరు 1న గచ్చిబౌలీ షూటింగ్‌ రేంజ్‌లో అకాడమీ ప్లాన్ చేస్తున్నారు. నారంగ్ రెండు నెలల క్రితమే జర్మనీ నుంచి ఈ సామగ్రిని తెప్పించారు. ఒక్కసారి కూడా వాటిని ఉపయోగించలేదుని గగన్ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లేసరికి అకాడమీలో 8 అడుగుల మేర నీటి చేరింది. అకాడమీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డ తమ బృందానికి తీవ్ర నిరాశ కలుగుతోందని గగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైఫిళ్లను తుడిచి ప్లాస్టిక్ కవర్‌పై ఆర బెట్టారు. అవి తిరిగి పనిచేస్తాయన్నది డౌటే మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.