యాప్నగరం

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నా జీవితంతో ఆడుకున్నాడు.. ట్యాబ్లెట్లు మింగేసిన రాధా రమణి

ట్యాబ్లెట్లు మింగేసిన రాధా రమణి దానికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానని అందులో పేర్కొన్నారు.

Samayam Telugu 17 Nov 2020, 10:03 am
బిజెపి నేత దుభ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రాజా రమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగలేదంటూ ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. రఘునందన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలురకాల ట్యాబెట్లు తింటూ ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది.రఘునందన్ తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని రాధా రమణి పేర్కొన్నారు.
Samayam Telugu రాధారమణి ఆత్మహత్యాయత్నం
radha ramani suicide attempt


అత్యాచారం కేసులో తనకు న్యాయం చెయ్యడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్తానంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు. అయితే రాధా రమణికి రహస్యంగా చికిత్స చేయించి ఇంటి దగ్గర ఆర్ సి పురం పోలీసులు దించారని సమాచారం.
20 ఏళ్లుగా పోలీసుల చటుట్ూ తిరుగుతున్న తనకు న్యాం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్సీపురం సీఐ చేసిన మోసంపై కూడా సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇంతవరకు సీఐపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు.

Read More : గ్రేటర్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డికి భారీ షాక్

నన్ను నా కొడకును ఆర్సీపురం సీఐ ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. తన జీవితంలో రఘునందన్ రావు ఆటలాడుకుంటున్నాడన్నారు. రఘునందన్ రావుపై తన ఆర్ఆర్ ఛానల్‌లో అన్ని వీడియోలు పెట్టానన్నారు. అలాంటి వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చి మరి దుబ్బాక ఉప ఎన్నికలో గెలిపించిందని రాధా రమణి ఆరోపించారు. కోటి రూపాయలు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడన్నారు. ప్రచారంలో ఉన్నానని మరోసారి పిటిషన్ వేసుకున్నాడన్నారు. అలా రఘునందన్‌రావను ప్రభుత్వం ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని గెలిపించిన పార్టీకి, మోదీకి ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా చట్టాలు మార్చలన్నారు ఆమె. మహిళలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అతడ్ని అరెస్ట్ చేయలేమంటున్నారు. అందుకే నిరసన వ్యక్తం చేస్తూ ట్యాబ్లెట్లు మింగేస్తున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అనేక రకాల ట్యాబ్లెట్లు మింగేశారు. మహిళలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. నా జీవితం జాతికి అంకితం చేస్తున్నానని అంటూ ఆమె పలు రకాల ట్యాబ్లెటలను మింగేశారు. ట్యాబ్లెట్లు మింగి పీఎస్‌కు వెళ్తున్నానంటూ ఆమె ట్యాబెట్లన్నీ వీడియో రికార్డ్ చేస్తూనే తినేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.