Rama Bhakt Is Not An Indian, Asaduddin Owaisi Makes Controversial Comments
రామభక్తి ఉంటే భారతీయుడు కాదు..వాడే నిజమైన ఇండియన్.. ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన భారతీయుడు ఎవరనే అంశంపై మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామ భక్తి ఉన్నవాడు భారతీయుడు కాదని.. గాంధీ, అంబేడ్కర్ భావజాలం ఉన్న వ్యక్తే అసలైన భారతీయుడని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్ఆర్పీ)పై తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. వీటికి వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టులో పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. తాము జైల్ భరో నిర్వహిస్తే, దేశంలో జైళ్లు సరిపోవని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేమని ఇప్పటికే ఈ వ్యతిరేకత మొదలై 50 రోజులు దాటిందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu2 Feb 2020, 8:35 pm
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన భారతీయుడు ఎవరనే అంశంపై మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామ భక్తి ఉన్నవాడు భారతీయుడు కాదని.. గాంధీ, అంబేడ్కర్ భావజాలం ఉన్న వ్యక్తే అసలైన భారతీయుడని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్ఆర్పీ)పై తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. వీటికి వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టులో పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. తాము జైల్ భరో నిర్వహిస్తే, దేశంలో జైళ్లు సరిపోవని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేమని ఇప్పటికే ఈ వ్యతిరేకత మొదలై 50 రోజులు దాటిందని వ్యాఖ్యానించారు.
ప్రధానోపాధ్యాయురాలిని పరామర్శించిన ఒవైసీ
శనివారం ఒవైసీ కర్ణాటకలోని బీదర్లో జైలులో ఉన్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కలిసి పరామర్శించారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పాఠశాలలో నాటకం ప్రదర్శించేందుకు అనుమతించినందుకు ఆమెపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలో ఇటీవల చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ విషయం తెలిసిన అసదుద్దీన్ ఒవైసీ బీదర్ జైలులో ఉన్న ఫరీదాబేగంను పరామర్శించారు. బీదర్ ఎస్పీ శ్రీధరను కలిసి పాఠశాలలో నాటిక ప్రదర్శించడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు.
Twitter-Dhanya Rajendran
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలే..
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, దూకుడుగా ప్రవర్తిస్తూ ఒవైసీ వార్తల్లో నిలుస్తుండే సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పంచే డబ్బు తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం ఎంఐఎంకే వేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనవరి 15న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో పౌరసత్వ బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాను నియంత, హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ తదితరులో పోల్చారు. ఈ బిల్లు నుంచి దేశాన్ని రక్షించడంతోపాటు అమిత్ షాను కూడా రక్షించాలని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ పౌరసత్వ చట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్ లానే హోమంత్రి కూడా ఉంటారని వ్యాఖ్యానించారు. సభలోనే బిల్లు పేపర్లను చించేశారు.
అయోధ్య స్థల వివాదంపైనా ఒవైసీ దూకుడుగా స్పందించారు. సుప్రీం తీర్పు పట్ల తాము సంతృప్తిగా లేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అంతకుమించి కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్ను తిరస్కరించాలని సూచించారు. ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఒవైసీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్నూ వదల్లేదు. గతేడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడి సందర్భంగా ఇమ్రాన్ ఖాన్పై విరుచుకుపడ్డారు. కెమెరా ముందు కూర్చొని భారత్కు సలహాలివ్వడం కాదని ఎద్దేవా చేశారు. పుల్వామా దాడి పాకిస్థాన్ మొదటి సారి చేయలేదని, గతంలో పఠాన్ కోట్, ఉరి ఉగ్రదాడులను ప్రోత్సహించిందని ఆక్షేపించారు. ఇమ్రాన్ ఖాన్ తన అమాయకపు ముసుగు తొలగించాలని మండిపడ్డారు. భారత్ వద్ద కూడా అణుబాంబులు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతేడాది ముంబయిలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చివరికి సైబరాబాద్ సీపీ సజ్జనార్తోనూ ఒవైసీకి ట్విటర్ వేదికగా వార్ నడిచింది. హైదరాబాద్లోని ఐటీ కంపెనీల్లో జీహాదీలు పనిచేస్తున్నారని సురేశ్ కొచ్చటిల్ అనే వ్యక్తిత ట్వీట్ చేయగా.. దీనిపై సజ్జనార్ స్పందించారు. ఆ ట్వీట్పై అసద్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లోని ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఎంత మంది పనిచేస్తున్నారో ఆ సంఖ్యను బహిర్గతం చేయండి? ఒక ఎంపీగా నాకు సమాధానం చెప్తారా? మోదీ భక్తులకే సమాధానమిస్తారా?' అని సజ్జనార్పై ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకవేళ ఐటీ కంపెనీల్లో జిహాదీలున్నా వారిని ఉదయం 5 గంటలకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయొద్దంటూ దిశ నిందితుల ఎన్కౌంటర్ను పరోక్షంగా ప్రస్తావించారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.