యాప్నగరం

ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్.. విద్యార్థుల కోసం స్పెషల్ ప్రోగ్రామ్

కళాశాల విద్యార్థుల కోసం రామకృష్ణ మఠం స్పెషల్ మెడిటేషన్ ప్రోగ్రామ్ రూపొందించింది. ఆలోచనల ప్రభావం, వాటి నియంత్రణ, ఒత్తిడిని దూరం చేసుకోవడంపై స్వామి బోధమయానంద స్వామి విద్యార్థులకు విలువైన సూచనలు చేస్తారు.

Samayam Telugu 6 Dec 2019, 9:51 pm
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా కళాశాలల విద్యార్థులు ఒత్తిడికి గురవుతుండడం ఆందోళనకు గురిచేసే అంశం. ఒత్తిడిని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మానసిక రుగ్మతలకు దారి తీసే అవకాశాలూ లేకపోలేదు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు మెడిటేషన్, యోగాభ్యసన వంటి కార్యక్రమాలు చక్కగా ఉపకరిస్తాయి.
Samayam Telugu meditation 2


విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూమన్ ఎక్సెలెన్స్ ప్రత్యేకంగా ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్‌లో ఆలోచనల ప్రభావం, వాటి నియంత్రణ, ఆలోచనలను తగ్గించుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడంపై స్వామి బోధమయానంద స్వామి విద్యార్థులకు విలువైన సూచనలు చేస్తారు. 16 నుంచి 25 ఏళ్లలోపు వారి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

విద్యార్థులు చదువుపై ఏకాగ్రత సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చదువు-జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం.. అనవసరమైన ఆలోచనలను నియంత్రించుకోవడంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఒత్తిడి ఉపశమన విధానాలపై తర్ఫీదునిస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్’ ప్రోగ్రామ్ ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.