మెరుగైన భారత్ కోసం.. 14న రామకృష్ణ మఠం వెబ్నార్
హైదరాబాద్లోని రామకృష్ణ మఠం ఆదివారం వెబ్నార్ (జూమ్ యాప్) ద్వారా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Samayam Telugu 13 Jun 2020, 10:18 pm
దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలపడమే లక్ష్యంగా హైదరాబాద్లోని రామకృష్ణ మఠం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం వంటి అనేక అంశాల్లో విశేష సేవ చేస్తున్న రామకృష్ణ మఠం.. లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమైన తరుణంలో వెబ్నార్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా ఆదివారం (జూన్ 14) ‘విద్య ద్వారా మెరుగైన భారతావని నిర్మాణం’ అనే అంశంపై రామకృష్ణ మఠంకు చెందిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ (వీఐహెచ్ఈ) వెబ్నార్ నిర్వహించాలని నిర్ణయించింది.
జూమ్ యాప్ ద్వారా ఈ వెబ్నార్ జరుగుతుంది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమాయానంద స్వామిజీ ఈ కార్యక్రమానికి మోడరేటర్గా వ్యవహరించనున్నారు. రామకృష్ణ మిషన్ (న్యూఢిల్లీ) సెక్రటరీ స్వామి శాంతత్మానంద గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ఇల్యుమైన్ నాలెడ్జ్ ఫౌండర్, ఎండీ వి.శ్రీనివాస్ ప్రసంగిచనున్నారు.
జూమ్ మీటింగ్ లింక్:
https://us02web.zoom.us/j/86873729617?pwd=UDdCU2hDNGlpUGNUYjlFcVFTakJVUT09
ఐడీ: 86873729617
పాస్వర్డ్: RKMHYD
సమయం: ఉదయం 11 గంటలకు (11 AM)
జూమ్ యాప్ ద్వారా ఈ వెబ్నార్ జరుగుతుంది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమాయానంద స్వామిజీ ఈ కార్యక్రమానికి మోడరేటర్గా వ్యవహరించనున్నారు. రామకృష్ణ మిషన్ (న్యూఢిల్లీ) సెక్రటరీ స్వామి శాంతత్మానంద గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ఇల్యుమైన్ నాలెడ్జ్ ఫౌండర్, ఎండీ వి.శ్రీనివాస్ ప్రసంగిచనున్నారు.
జూమ్ మీటింగ్ లింక్:
https://us02web.zoom.us/j/86873729617?pwd=UDdCU2hDNGlpUGNUYjlFcVFTakJVUT09
ఐడీ: 86873729617
పాస్వర్డ్: RKMHYD
సమయం: ఉదయం 11 గంటలకు (11 AM)