యాప్నగరం

మైండ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌పై శిక్షణ.. రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్

యువతకు మైండ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌పై శిక్షణనిచ్చేందుకు రామకృష్ణ మఠం ప్రత్యేక తరగతులు నిర్వహించనుంది. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఐదు రోజుల పాటు తరగతులు జరుగుతాయి.

Samayam Telugu 26 Nov 2019, 10:55 pm
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో అత్యుత్తమ మానవ వనరులను దేశానికి అందించేందుకు రామకృష్ణ మఠం నిర్విరామంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థులు, యువత, మహిళలకు యోగా, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), వ్యక్తిత్వ వికాసం(పర్సనాలిటీ డెవలప్‌మెంట్), ఒత్తిడిని జయించడం వంటి అంశాలపై శిక్షణనిస్తూ సన్మార్గం వైపు నడిచేందుకు దిక్సూచిగా నిలుస్తోంది.
Samayam Telugu mind management


వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మనిషి తన సామర్థ్యాన్ని తెలుసుకోవడం.. అలాగే తన తెలివితేటలను సమర్థంగా వినియోగించుకునేందుకు అవసరమైన టెక్నిక్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మెదడు శక్తి.. నిర్వహణపై శిక్షణనిస్తారు.

ఆలోచనలను నియంత్రించుకోవడం.. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం.. విజయం సాధించేందుకు అవసరమైన ఏకాగ్రతను అలవర్చుకోవడంపై స్వామీజీలు శిక్షణనిస్తారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్విహిస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. సాయంత్రం 6.20 గంటల నుంచి 7.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.