యాప్నగరం

‘భయాన్ని అధిగమించడం ఎలా’ ఆన్‌లైన్ కోర్సు.. రామకృష్ణ మఠ్ దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని రామకృష్ఠ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌సిట్ట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ కరోనా వైరస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తోంది.

Samayam Telugu 23 Jul 2020, 4:13 pm
హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌సిట్ట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. స్వామి వివేకానంద బోధించిన‘అరైస్, అవేక్, ఓవర్‌కమ్ ఫియర్’ అనే అంశంపై ఆరు రోజుల కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. ‘మేల్కొని భయాన్ని అధిగమించు’ అనేది వివేకానందుడి సిద్ధాంతం. ఈ కోర్సులో భాగంగా ఆరు రోజుల పాటు ఇదే అంశాలను బోధించనున్నారు.
Samayam Telugu భయాన్ని అధిగమించడానికి వివేకానందుడి బోధనలు
Ramakrishna Math


కోర్సులో భాగంగా భయం: దానికి కారణం.. ఉపశమనం, తెగింపు-భయాన్ని అధిగమించడంపై వివేకానందుడి బోధనలు, భయాన్ని ఎలా అధిగమించాలో ప్రాక్టికల్స్, భయాన్ని అధిగమించి గొప్పవారిగా మారిన వ్యక్తుల గురించి ఉదాహరణలు తెలియజేయనున్నారు.

జులై 20 నుంచి 25 వరకు ఆరు రోజులు ఈ కోర్సు ఉంటుంది. 18 నుంచి 50ఏళ్లలోపువారు చేరవచ్చు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు తరగతులు ఉంటాయి. ఔత్సాహవంతులైన యువకులు, ప్రొఫెషనల్స్ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ రుసుం కింద రూ.200 చెల్లించాలి. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్టు వివేకానంద ఇన్‌సిట్ట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ తెలిపింది.

మరోవైపు, నాలుగు నెలల కాలపరమితితో కూడిన ‘యోగ అధ్యయన్ శిబిర్’సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల కాలపరిమితి కలిగిన ఈ కోర్సులో ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.