యాప్నగరం

ఆర్కే మఠ్‌లో యోగ వేదాంత మెడిటేషన్ కోర్సు.. అందరూ అర్హులే

అసలే ఉరుకులు పరుగుల జీవితం.. ఉద్యోగాలు, బాధ్యతలతో నేటి తరం మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే యోగా ఓ గొప్ప మార్గం. అలాంటి వారికోసమే ఆర్కే మఠ్ పలు యోగా కోర్సులను నిర్వహిస్తోంది.

Samayam Telugu 22 Dec 2019, 11:58 am
ఉరుకులు పరుగులు జీవనంలో తమ గురించి తామే పట్టించుకోవడంలేదు. ఏ పని చేయాలన్నా.. మొదట మన మనసుపై నియంత్రణ సాధించాలి. తనపై తాను నియంత్రణ సాధించిన వారిని ప్రపంచంలో ఏ శక్తీ నిలువరించలేదు. అలాంటి వ్యక్తి మెదడు సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటుంది. వారు మాత్రమే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంతోషంగా జీవించగలుగుతారు. ఇలాంటి విషయాలు బోధించడంలో హైదరాబాద్‌లో రామకృష్ణ మఠానికి చెందిన స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (వీఐహెచ్) ముందుటుంది.
Samayam Telugu yoga


‘యోగ వేదాంత మెడిటేషన్’ కోర్సు అందిస్తోంది. ఆధ్యాత్మిక చింతన, ఒత్తిడి నుంచి ఉపశమనం, జీవితంలో సమతౌల్యత సాధించడం ఈ కోర్సు ద్వారా సాధ్యమవుతుందని, ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులో చేరవచ్చని రామకృష్ణ మఠం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం ఐదు రోజుల కోర్సులో మెడిటేషన్, యోగా గురించి ప్రయోజనాలను వివరించనున్నారు.

డిసెంబరు 23 నుంచి 27 వరకు తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం 6.15 నుంచి 7.30 వరకు తరగతులు ఉంటాయి. కోర్సులో చేరడానికి ఫీజు రూ.200. 18 నుంచి 55 ఏళ్లలోపు వయసున్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.