యాప్నగరం

ఈ గణపతులు వాడిన వారే గ్రీన్ హీరోలు.. రామ్‌కీ ఎన్విరో ప్రకటన

Vinayaka Chavithi 2020: మట్టి విగ్రహాలు, విత్తనాలతో కూడిన గణేష్ విగ్రహాలను పూజలో వినియోగించే నగరవాసులను గ్రీన్ హీరోలుగా గుర్తిస్తామని రామ్‌కీ ఎన్విరో సంస్థ ప్రచారం చేస్తోంది.

Samayam Telugu 14 Aug 2020, 3:01 pm
పర్యావరణ హిత కార్యక్రమాల పట్ల చొరవ తీసుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహించే రామ్‌కీ ఎన్విరో సంస్థ వినాయక చవితి సందర్భంగా మరో అవగాహన కార్యక్రమంతో ముందుకొచ్చింది. ప్రముఖ రేడియో సంస్థ బిగ్ ఎఫ్ఎంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనుకూల గణేష్ ప్రతిమలను పూజించడాన్ని రామ్కీ బిగ్ గ్రీన్ గణేషా ప్రోత్సహించడంతో పాటుగా పర్యావరణానికి వీలైనంతగా అతి తక్కువ నష్టం కలిగేలా వేడుకలు జరుపుకోవాలని ప్రచారం కల్పిస్తోంది. మట్టి విగ్రహాలు, విత్తనాలతో కూడిన గణేష్ విగ్రహాలను పూజలో వినియోగించే నగరవాసులను గ్రీన్ హీరోలుగా గుర్తిస్తామని సంస్థ ప్రచారం చేస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ramky enviro conducts special Awareness program


ఇందుకోసం తాము కూడా బిగ్ ఎఫ్ఎంతో కలిసి విత్తనాలతో కూడిన మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తామని వెల్లడించింది. మట్టిలో కలిసిపోయే కొబ్బరి పీచుతో ఈ విగ్రహాలు రూపుదిద్దుకోనున్నాయి. హైదరాబాద్‌లో పలు గేటెడ్ కమ్యూనిటీల వద్ద ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ విగ్రహాలను తమ ఇంట్లోనే పూల కుండీల్లో నిమజ్జనం చేయవచ్చు. ఆగస్టు 13 నుంచి 22 తేదీ వరకూ నగరమంతా ఈ ప్రచారం నిర్వహించనున్నారు.

ప్రచారం కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలను సైతం భాగం చేయనున్నారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, భానుచందర్, యువ హీరోలు గోపీచంద్, కార్తికేయ, సుధీర్ బాబు, హీరోయిన్లు ప్రియమణి, ఈషా రెబ్బా తదితరులతో ప్రచారం చేయించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.