యాప్నగరం

ముగ్గురు సర్పంచులు, పలువురు అధికారులపై కలెక్టర్ వేటు

Rangareddy Dist: కందుకూరు మండల పరిషత్‌ అధికారి జి.విజయలక్ష్మితో సహా ముగ్గురు సర్పంచ్‌లు, ఒక ఉప సర్పంచ్, ఏడుగురు గ్రామ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Samayam Telugu 23 Sep 2020, 11:01 pm
ప్రభుత్వ పథకాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చూపిస్తున్న సర్పంచ్‌లపై వేటు పడింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల విషయంలో వెనుకబడి ఉన్న ముగ్గురు సర్పంచ్‌లు, ఏడుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అధికారి, ఓ ఉప సర్పంచ్‌ను సస్పెండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వైకుంఠధామాల నిర్మాణం, పల్లె పకృతి వనాల ఏర్పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలను సరిగ్గా చేపట్టకపోవడం వంటివాటివల్ల కందుకూరు మండల పరిషత్‌ అధికారి జి.విజయలక్ష్మితో సహా ముగ్గురు సర్పంచ్‌లు, ఒక ఉప సర్పంచ్, ఏడుగురు గ్రామ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.
Samayam Telugu రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్
Rangareddy collector


రైతు వేదికల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతోపాటు తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను రాజేంద్రనగర్ పంచాయతీ రాజ్ విభాగం డీఈఈ సంజీవరెడ్డి, ఏఈఈ శ్రీనివాసులుకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

వేటు పడ్డ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌‌లు వీరే..
* మాడ్గుల్ మండలం కోలుకులపల్లి గ్రామ సర్పంచ్ బట్టు అనురాధ
* కందుకూరు మండలం పులిమామిడి గ్రామ సర్పంచ్ వి.అనిత
* మొయినాబాద్ మండలం తోల్‌ కట్ట సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్
* నందిగామ మండలం మామిడిపల్లి ఉప సర్పంచ్ హనుమంతరెడ్డి

సస్పెండ్ అయిన కార్యదర్శుల వివరాలు..
* శంకరపల్లి మండలం మోకిళ్ల గ్రామ కార్యదర్శి పి.లక్ష్మీతులసి
* మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామకార్యదర్శి ఎన్.హరిశ్చంద్‌
* కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి ఎ.శంకర్
* ఆమనగల్ మండలం మేడిగడ్డ గ్రామ కార్యదర్శి వై.చరిత
* కేశంపేట మండలం నంది వనపర్తి గ్రామ కార్యదర్శి ఆర్వా శ్రవణ్‌కుమార్‌
* యాచారం మండలం మాల్ గ్రామ కార్యదర్శి కొమ్మని సుహాసిని

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.