తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. చౌకడిపోల్లో రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 20 వరకు కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై.. 15తో ముగుస్తుంది. అయితే ఉచిత బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడంతో.. పంపిణీ ఈ నెల మూడు రోజులు ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలోనే లబ్దిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం ఈ నెల ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి.
తెలంగాణ రేషన్ కార్డు దారులకు శుభవార్త.. సర్కార్ కీలక నిర్ణయం
ఉచిత బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడంతో.. రేషన్ పంపిణీ ఈ నెల మూడు రోజులు ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu 17 May 2021, 8:02 am
ప్రధానాంశాలు:
- ప్రతీ నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ
- మూడురోజులు ఆలస్యంగా మొదలైన పంపిణీ
- ఈనెల 20వరకు రేషన్ బియ్యం పంపిణీ