యాప్నగరం

జీడిమెట్ల పేలుడు: ఇద్దరు కార్మికుల మృతి.. విషాద దృశ్యాలు

Jeedimetla రసాయన పరిశ్రమలో సంభవించిన పేలుడు తీవ్ర విషాదం నింపింది. రియాక్టర్ వద్ద పని చేస్తున్న ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పేలుడు దాటికి అర కి.మీ. దూరం వరకు శకలాలు ఎగిరిపడ్డాయి.

Samayam Telugu 18 Nov 2019, 7:31 pm
జీడిమెట్ల పారిశ్రామికవాడలో సంభవించిన పేలుడు కార్మికుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. జీవిక లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీలో సోమవారం (నవంబర్ 18) సాయంత్రం రియాక్టర్ భారీ శబ్దం చేస్తూ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు దాటికి పరిశ్రమ భవనం పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. శకలాలు అర కిలోమీటరు వరకు ఎగిరిపడ్డాయి. దీంతో స్థానికులు భయందోళనలు గురయ్యారు.
Samayam Telugu blast2
జీడిమెట్ల పరిశ్రమలో పేలుడు


ఈ ప్రమాదంలో అన్వర్ అనే కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతడి స్వస్థలం బీహార్. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు అంబరీశ్ మృతి చెందాడు. ప్రమాదంలో మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పేలుడు సంభవించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీవిక పరిశ్రమ నుంచి విష వాయువులు వెలువడుతున్నాయని గతంలో కాలుష్య నియంత్రణ మండలి, పోలీసులకు ఫిర్యాదు చేశామని.. అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు

పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు అన్వర్, అంబరీశ్.. రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రసాయన పరిశ్రమ కావడం, పేలుడు కారణంగా విష రసాయనాలు వెలువడటంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.