యాప్నగరం

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య.. కాల్ రికార్డింగ్‌‌‌లో సంచలన విషయాలు వెలుగులోకి!

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకు ఈ ప్రాంతంలోని భూ వివాదాలే కారణమని తెలుస్తోంది. గౌరెల్లి గ్రామానికి చెందిన 412 ఎకరాల భూమికి సంబంధించి వివాదం సాగుతోంది. ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ వైరల్‌‌గా మారింది.

Samayam Telugu 6 Nov 2019, 4:01 pm
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి ఆఫీసులోనే సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదమే ఆమె హత్యకు కారణమని తెలుస్తోంది. అక్రమ భూదందాల వ్యవహరంతో.. రైతులు విసిగిపోయారని తెలుస్తోంది. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu tahasildar vijaya reddy.


‘‘గౌరెల్లి ప్రాంతానికి చెందిన రైతులు నిజాం హయాంలో 412 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1950లలో పాస్‌బుక్‌లు ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి.. ఈ భూమి నాదంటూ కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగేవారు. దీంతో వివాదాలు తలెత్తాయి. చిన్న చిన్న లొసుగులను చూపి బెదిరిస్తూ భూములను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద అంబర్ ‌పేట ప్రాంతంలోనూ 402 ఎకరాలకు సంబంధించి కూడా ఇలాగే వివాదం మొదలైంది. 1955లో రైతులు భూమిని కొనుగోలు చేయగా.. 1976 దాకా వారి పేరిటే ఉంది. తర్వాత కూడా వారిపేర్లు ఉన్నాయి ఓఆర్సీలు కూడా ఇచ్చారు. కానీ ఆ ఏడాది రౌండప్ చేసి ఓ ముస్లిం వ్యక్తి పేరు రాశారు.

దీంతో మాకు తెలియకుండా ఓఆర్సీ ఇచ్చారని ముస్లి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసులో హోం మంత్రి మహమూద్ అలీ కొడుకు ప్రమేయం కూడా ఉంది. గౌరెల్లి, పెద్ద అంబర్‌పేట భూముల వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి.

ఈ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. రైతుల దగ్గర్నుంచి ఆయన రూ.30 లక్షలు తీసుకున్నారు. ఎమ్మార్వోను హత్య చేసిన వ్యక్తి కూడా ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చాడు’’ అని ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన సంభాషణ భూదందాలు జరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.