యాప్నగరం

తల్లిదండ్రుల మృతితో రోడ్డున పడ్డ ఆడపిల్లలు.. అద్దె ఇంట్లో పెద్దకర్మకు నో..

Karimnagar: కాట్నపల్లి గ్రామంలో సమత, మమత ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు కనకవ్వ, పాపయ్య గౌడ్. తల్లి కనకవ్వ క్షయవ్యాధి వల్ల 8 ఏళ్ల క్రితం ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి వీరు తండ్రి పాపయ్య గౌడ్ సంరక్షణలో తమకు ఉన్న చిన్న గుడిసెలో ఉంటున్నారు.

Samayam Telugu 3 May 2020, 10:43 pm
తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు ఆడపిల్లలు రోడ్డున పడ్డ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోగా, తండ్రి నాలుగు రోజుల కిందటే మరణించాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు తండ్రి కర్మకాండను అద్దె ఇంట్లో చేయనివ్వకపోవడం ఆ రెండు మనసుల్ని మరింతగా కుంగదీస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Samayam Telugu నగదు సాయం అందిస్తున్న ఎమ్మెల్యే


కాట్నపల్లి గ్రామంలో సమత, మమత ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు కనకవ్వ, పాపయ్య గౌడ్. తల్లి కనకవ్వ క్షయవ్యాధి వల్ల 8 ఏళ్ల క్రితం ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి వీరు తండ్రి పాపయ్య గౌడ్ సంరక్షణలో తమకు ఉన్న చిన్న గుడిసెలో ఉంటున్నారు. గత వానాకాలంలో వారి గుడిసె కూలిపోవడంతో అదే ఊళ్లో చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం పాపయ్య గౌడ్‌కు గుండెపోటు రావడంతో హఠ్మానరణం చెందాడు. దీంతో ఆడపిల్లలు సమత, మమత అనాథలుగా మారి దిక్కులేనివారు అయ్యారు.

Also Read: undefined

నిరు పేద కుటుంబం కావడంతో దాతల సాయంతో అష్టకష్టాలు పడి ఆడపిల్లలిద్దరే తండ్రికి అంత్యక్రియలు చేశారు. అయితే, ఆ తర్వాత తండ్రికి చేయాల్సిన పెద్ద కర్మను తమ ఇంట్లో చేసేందుకు ఇంటి ఓనర్లు ససేమిరా అన్నారు. అసలే పుట్టెడు దు:ఖంలో ఉన్న అక్కా చెల్లెళ్లు చేసేది లేక ఊరి బయట టెంటు వేసుకొని కర్మకాండలు జరిపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు తెలిసింది. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా సమత, మమతకు రూ.20 వేల ఆర్థిక సాయం, క్వింటా బియ్యం అందించారు.

Must Read: undefined

అంతేకాక, సమత, మమతకు దాతలు సాయం చేయాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు. వారు ఇచ్చే డబ్బు జమ చేసేందుకు బ్యాంకు ఖాతా సైతం తెరిపిస్తామని హామీ తెలిపారు. లాక్‌ డౌన్ పూర్తికాగానే అక్క సమతకు ఉపాధి, ఉద్యోగం లేదా పెళ్లి చేయిస్తానని, ఈ బాధ్యత పూర్తిగా తనదేనని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. మమతకు గురుకుల పాఠశాలలో చదువుకొనేలా సీటు ఇప్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.