యాప్నగరం

Ghmc Elections: ఓల్ట్‌మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్

మంగళవారం జరిగిన ఎన్నికల్లో రెండు గంటలు ఓటింగ్ అయిన తర్వాత సీపీఐ పార్టీకి చెందిన గుర్తులు తారుమారు అయ్యాయని ఫిర్యాదు అందింది. దీంతో అక్కడ ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తన్నారు.

Samayam Telugu 3 Dec 2020, 7:47 am
పాత మలక్‌పేటలోని ఇవాళ రీపోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటలకు రీపోలింగ్‌ ప్రారంభించారు అధికారులు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 276 మంది అధికారులు పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి సంధ్యారాణిని బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో శైలజను నియమిస్తూ ఎన్నికల అథారిటీ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. మంగళవారం పోలింగ్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.సీపీఐ పార్టీకి చెందిన గుర్తులు తారుమారు రావడంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్


Read More: నేను ఏమైనా ఎర్రి పువ్వునా.. మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

ఓటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత బ్యాలెట్‌ పత్రాల్లో కంకి కొడవలి(సీపీఐ)కి బదులు సుత్తి కొడవలి ఉన్నట్లు గుర్తించిన సీపీఐ అభ్యర్థి ఫిర్దౌస్‌ ఫాతిమా ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. దీంతో మంగళవారం ఎన్నికలు నిలిపివేసేసరికి 3450 మంది ఓటు వేశారు. వీరికి గురువారం ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా మధ్య వేలికి సిరా చుక్క వేస్తున్నారు. రీపోలింగ్‌ సందర్భంగా ఆ ప్రాంత పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. 54,502 మంది ఓటర్లు తమ ఈ డివిజన్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.