యాప్నగరం

కేసీఆర్‌కు ఏమైంది?‌ ఆయన ఆరోగ్యంపైనా హెల్త్ బులెటిన్.. రేవంత్ డిమాండ్

Hyderabad Coronavirus: ‘‘క‌రోనా బాధితుల‌కు చికిత్స విష‌యంలో ఒక్కో పేషెంట్‌పై రూ.3.50 లక్షల ఖర్చు చేస్తునట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది కరోనా పేషెంట్లకు రూ.మూడున్నర లక్షలు ఖర్చు చేశారో చెప్పాలి’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

Samayam Telugu 7 Jul 2020, 8:16 pm
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా వైరస్‌పై సమీక్ష కోసం గవర్నర్ పిలిచినా రాలేదని గుర్తు చేశారు. కాబట్టి వెంటనే సీఎస్‌ను, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సచివాలయ కూల్చివేతపై మంగళవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి, కేసీఆర్
Revanth Reddy KCR


గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్‌కి ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కేంద్ర మంత్రి కలగజేసుకోవాల‌ని అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను గాలికొదిలేసి ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారని, పీవీ శతజయంతి రోజు మాయమైన‌ సీఎం ఇప్పటి వరకు కనిపించడం లేదని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అఖిలపక్షాన్ని పిలవాల‌ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా అని రేవంత్ ప్రశ్నించారు.

Must Read: undefined

మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఉంటుందని, హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ అనే వార్తలతో ప్రజలంతా హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘సెక్షన్-8ని గవర్నర్ ఉపయోగించి హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రైవేట్-ప్రభుత్వ వైద్యాన్ని ఒకే వేదిక మీదకు తేవాలి. దాతలు ఇచ్చిన నిధులను ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. గవర్నర్ తక్షణమే అధికారులకు నోటీసులు ఇవ్వాలి.

క‌రోనా బాధితుల‌కు చికిత్స విష‌యంలో ఒక్కో పేషెంట్‌పై రూ.3.50 లక్షల ఖర్చు చేస్తునట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది కరోనా పేషెంట్లకు రూ.మూడున్నర లక్షలు ఖర్చు చేశారో చెప్పాలి’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

Must Read: హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి భారీ దోపిడీ.. కరోనా చికిత్సకు 9 రోజులకు 10 లక్షల బిల్లు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.